చెన్నై, జూలై 28 (way2newstv.com)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అనారోగ్యానికి గురై ఇంట్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్కు ఫోన్ చేసి ఆరాతీశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం స్టాలిన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. కరుణానిధి కుమార్తె కనిమొళితోనూ మోదీ సంభాషించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన మోదీ.. కరుణానిధికి అవసరమైన వైద్యంపై ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని తెలిపారు.
కరుణానిధికి మోడీ పరామర్శ