న్యూ డిల్లీ ఆగష్టు 18 (way2newstv.com)
ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి భౌతిక కాయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది నివాళులర్పించారు. వాజ్ పేయి శవపేటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మన్మోహన్ నివాళులర్పించారు. అంతకుముందు, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, అమిత్ షా, భూటాన్ రాజు వాంగ్ చుక్, నేపాల్ మంత్రి తదితరులు తుది నివాళులర్పించారు. కాగా, వాజ్ పేయి భౌతికకాయానికి తుది నివాళులర్పించిన ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వాజ్ పేయిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.కాగా వాజ్ పేయికి అంతిమ వీడుకోలు పలుకడానికి తెలంగాణాకు చెందిన బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, డా. కే.లక్ష్మణ్,నల్లు ఇంద్ర సేన రెడ్డి,జి.కిషన్ రెడ్డి,చింతల రామచంద్ర రెడ్డి తదితరులు డిల్లికి వెళ్లారు.
తుది నివాళులర్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్