చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపి త్వరితగతిన అభివృద్ధి ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ భట్టాచార్య కితాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపి త్వరితగతిన అభివృద్ధి ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ భట్టాచార్య కితాబు

అమరావతి ఆగష్టు 28 (way2newstv.com) 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య మంగళవారం కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై చంద్రబాబుకు భట్టాచార్య హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య కితాబిచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా... కేరళ వరద బాధితులకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14, 83, 336 ల చెక్కును సీఎం చంద్రబాబుకు భట్టాచార్య అందజేశారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని ఆయన కోరారు.
 
 
 
చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపి త్వరితగతిన అభివృద్ధి 
   ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ భట్టాచార్య కితాబు