మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు ప్రభుత్వం కృషి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు ప్రభుత్వం కృషి

రాజమహేంద్రవరం  ఫిబ్రవరి 25 (way2newstv.com
తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి మహిళా శక్తి అండగా ఉందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. అర్పిలు, మహిళ సంఘాల ఆద్వర్యం లో మహిళలతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. వాటిలో భాగంగానేపసుపు కుంకుమ పథకంలో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళకు10,000 వేల రూపాయలు అందించారని తెలిపారు. 


మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు ప్రభుత్వం కృషి

మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుకు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని అన్నారు. మహిళ సంఘాలు అభివృద్ధి చెందలన్నా,ఆర్ధికంగాఎడగలన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలన్నారు. మహిళలు మద్దతు ఇచ్చి చంద్రబాబు ను మరోసారి ముఖ్యమంత్రి ని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, రెడ్డి రాజు, మినిమం వేజెస్ కమిటీ డైరెక్టర్ నక్కా చిట్టిబాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాశీ నవీన్, కూర గంటి సతీష్, కార్పొరేటర్ కడలి రామకృష్ణ, కూర గంటి ఈశ్వరి, బెజవాడ రాజ్ కుమార్, కోసూరి చండీప్రియ, పితాని లక్ష్మి, ఇన్నమూరి రాంబాబు, కొమ్మ శ్రీను, మజ్జి పద్మ, మాజీ కార్పొరేటర్ బొమ్మన మైన శ్రీనివాస్, నాయకులు రుంకని వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి బాబీ, సాయి, పితాని కుటుంబరావు, కడితి జోగారావు, ఈతల పాటి కృష్ణ, జక్కంపూడి అర్జున్, కర్రీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.