వైమానిక దళం దాడులపై బిగుస్తున్న పీట ముడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైమానిక దళం దాడులపై బిగుస్తున్న పీట ముడి

టెర్రరిస్టుల మృతదేహాలు చూపాలని అమర జవాన్ల కుటుంబాల డిమాండ్
న్యూ ఢిల్లీ మార్చ్ 6 (way2newstv.com );
బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఓ వైపు రకరకాల సంఖ్యలు చెప్తున్నది. తాజాగా లెక్కతేలాల్సి ఉందని సంజాయిషీ లాంటిది ఇచ్చుకున్నది. ఇక విపక్షం వైమానిక దాడి రాజకీయ లక్ష్యాల కోసం జరిగిందని ఆరోపిస్తుంటే రక్షణ బలగాల ఆత్మస్థెర్యం విపక్షాలు దెబ్బతీస్తున్నాయని పాలక పక్షం ఎదురుదాడికి దిగుతున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలు టెర్రరిస్టుల మృతదేహాలు చూపాలని డిమాండ్ చేయడం విశేషం. పుల్వామా ఉగ్రదాడిలో షామిలికి చెందిన ప్రదీప్కుమార్,  మైన్ పురికి చెందిన రాంవకీల్ అమరులయ్యారు. ఆ దాడికి ప్రతీకారంగా బారతదేశం సుమారు 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఉగ్రవాద శిబిరాలపై దాడికోసమని పాక్ భూభాగంపైకి యుద్ధవిమానాలను పంపింది. 


వైమానిక దళం దాడులపై బిగుస్తున్న పీట ముడి

వేల టన్నుల పేలుడు పదార్తాలను గుమ్మరించినట్టు వార్తలు వెలువడ్డాయి. శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో మరణించినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కాన అంతర్జాతీయ మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు వస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య ఆ ఇద్దరు జవాన్ల కుటుంబాలు ఉగ్రవాదులు మరణించినట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. సాక్ష్యం చూపేంత వరకు ఎలా నమ్మగలం. పాకిస్థాన్ అసలు ఎలాంటి నష్టం జరుగలేదని అంటున్నది.పుల్వామా దాడి తరహాలో విరిగిన కాళ్లూచేతులు, మొండాల ఫొటోలు రావాలి కదా. సరైన ఆధారాలు లేకుండా ఉగ్రవాదులు చనిపోయినట్టు నమ్మడానికి మేం సిద్ధంగా లేం. రుజువు చూపితేనే మా అమరవీరుల బలిదానానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు మేం నమ్ముతాం.. అని రాంవకీల్ సోదరి రాంరక్ష తేల్చిచెప్పింది. అటు షామిలిలో ప్రదీప్ కుమార్ తల్లి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. టీవీలో ఉగ్రవాదుల మృతదేహాలు చూపితేనే కదా నమ్మగలిగేది అని ఆమె నిలదీస్తున్నారు. ఈ వివాదం ప్రభుత్వానికి ఇరకాటంగా తయారైంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ సభలో మాట్లాడుతూ 300 మొబైల్ పోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నట్టు జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ ఎన్టీఆర్వో తెలిపిందని వెల్లడించారు. మరి 300 సెల్ఫోన్లు మనుషులు కాక చెట్లు ఉపయోగిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. కానీ మృతుల వివరాలపై కచ్చితమైన లెక్కలను ఇప్పటికీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.