ఇంద్రకీలాద్రిలో కొత్త సేవలు

విజయవాడ, మార్చి 14, (way2newstv.com)  
విజయవాడ కనకదుర్గ ఆలయంలో రెండు కొత్త సేవలు ప్రారంభిస్తున్నామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.  వేకువజామున 3 గంటల నుంచి 4 గంటల.వరకు ప్రదక్షణలు అనంతరం దర్శనం  రూ.116 టికెట్,   అద్దాల మండపంలో రాత్రి 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పవళింపుసేవ టికెట్  రూ.516 వుంటుందని ఆమె అన్నారు. 


 ఇంద్రకీలాద్రిలో కొత్త సేవలు

ఈ కొత్త సేవలు ఈ నెల 16 నుండి ఈ సేవలు ప్రారంభం అవుతాయని ఆమె అన్నారు.  ఉగాదిని పురస్కరించుకొని వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో రోజుకో రకం పుష్పాలతో సహస్రనామార్చనలు జరుపుతామని ఆమె అన్నారు. ఉగాది రోజు వేకువజామున 3 గంటల  మరుసటిరోజు 3 గంటల వరకు 24 గంటలపాటు లలితా సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం వద్ద వుంటుందని ఆమె అన్నారు.
Previous Post Next Post