వనపర్తి, మార్చి 1, (way2newstv.com)
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామ స్టేజి సమీపంలో, జాతీయ రహదారి 44 పై శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. కర్నూలు నుండి హైద్రాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ని డీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
రోడ్డు ప్రమాదం. ఇద్దరు వ్యక్తులు మృతి
Tags:
Andrapradeshnews