హైదరాబాద్, మార్చ్ 5 (way2newstv.com)
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంతో సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలపై ప్రతీ రోజు సమీక్షించుకుని, ఏరోజుకు ఆ రోజు అనుగుణమైన వ్యూహం రూపొందించుకుంటున్నట్లు వివరించారు. రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ సౌధలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ సరఫరాపై సమీక్ష