విద్యుత్ సరఫరాపై సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యుత్ సరఫరాపై సమీక్ష

హైదరాబాద్, మార్చ్ 5 (way2newstv.com
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంతో సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా  అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలపై ప్రతీ రోజు సమీక్షించుకుని, ఏరోజుకు ఆ రోజు అనుగుణమైన వ్యూహం రూపొందించుకుంటున్నట్లు వివరించారు. రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ సౌధలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 


విద్యుత్ సరఫరాపై సమీక్ష