ఏపిఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ

అమరావతి మార్చ్ 29 (way2newstv.com)
ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఏపిఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ

ఐబీ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసీ తీరుపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్‌కు సంబంధం లేదని పేర్కొంటూ ఆయన బదిలీని నిలుపుదల చేసింది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో డీజీని ప్రభుత్వం బదిలీ చేసింది.
Previous Post Next Post