మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు

ముంబై, మే 3, (way2newstv.com)
ఐపీఎల్ 2019 సీజన్‌ ప్లేఆఫ్ రేసు ఉత్కంఠగా మారిపోయింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తులని ఖాయం చేసుకోగా.. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లు పోటీపడుతున్నాయి. రెండు రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆదివారంతో సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగియనుండగా.. మంగళవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభంకానున్నాయి. 
1. సన్‌రైజర్స్ హైదరాబాద్ : తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొంది 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే శనివారం బెంగళూరుతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అప్పుడు కోల్‌కతా (12 పాయింట్లు) లేదా పంజాబ్ (12) జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆ జట్లతో సమానంగా నిలుస్తుంది. ఆ సమయంలో నెట్‌ రన్‌రేట్ కీలకం కానుండగా.. ఆ జట్లతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. కానీ.. గురువారం రాత్రి ముంబయి చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిన హైదరాబాద్ ఇప్పుడు ఒత్తిడిలో ఉంది.


మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు

2. రాజస్థాన్ రాయల్స్: తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది.. ఒక మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో బెంగళూరుతో పాయింట్‌ని పంచుకుంది. దీంతో.. ఆ జట్టు 11 పాయింట్లతో ఇప్పుడు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ చేరడం గగనమే. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచి.. ఆ తర్వాత హైదరాబాద్‌ని బెంగళూరు ఓడించాలని, కోల్‌కతా, పంజాబ్ జట్లు కనీసం ఒక్క మ్యాచ్‌లో ఓడాలని కోరుకోవాలి. 
3. కోల్‌కతా నైట్‌రైడర్స్: తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్, ముంబయి టీమ్స్‌ని ఓడించాలి. అయినప్పటికీ.. హైదరాబాద్‌తో పోలిస్తే నెట్‌ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో.. బెంగళూరు జట్టు తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని ఓడించాలని కోల్‌కతా కోరుకోవాలి. 
4. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కోల్‌కతా జట్టు తరహాలోనే.. పంజాబ్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంది. 12 మ్యాచ్‌లాడిన ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్‌కి చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా, చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించాలి. అంతేకాకుండా.. హైదరాబాద్‌ని బెంగళూరు ఓడించాలని కోరుకోవాలి. 
హైదరాబాద్, రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. కోల్‌కతా లేదా పంజాబ్ జట్లు ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. అప్పుడు నెట్‌ రన్‌రేట్ కీలకమవుతుంది. అన్ని జట్లతో పోలిస్తే.. రన్‌రేట్ విషయం‌లో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉంది.