ముగిసిన గంగమ్మ జాతర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముగిసిన గంగమ్మ జాతర

తిరుపతి మే 15 (way2newstv.com)   
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన జాతర అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తొలుత గంగమ్మ ఆలయంలోని స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. నీలవర్ణ శోభితమై భక్తులను కటాక్షించే అమ్మవారి వీక్షణ కోసం నగరవాసులు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద పోటెత్తారు. 


ముగిసిన గంగమ్మ జాతర

మూడు రోజుల నుంచి నగరంలో ఇంటింటికీ తిరుగుతూ నీరాజనాలందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతి ఇవ్వటంతో జాతర ముగిసింది. అనంతరం విశ్వరూప మృతికను భక్తులకు పంచిపెట్టారు. బంకమట్టి గడ్డితో తయారు చేసిన ఈ విశ్వరూప మృతికను ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకం.