జేసీపై చర్యలకు సిఫార్స్ చేశాం: ద్వివేది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జేసీపై చర్యలకు సిఫార్స్ చేశాం: ద్వివేది

అమరావతి మే 3 (way2newstv.com)
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన వివాదాస్పద చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలు ఇచ్చామని ఏఈ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, 


జేసీపై చర్యలకు సిఫార్స్ చేశాం: ద్వివేది

ఈ సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన జేసీపై చర్యలకు సిఫార్సు చేశామని ఆయన పేర్కొన్నారు. జేసీ వ్యాఖ్యలు మీడియాలో చూశామని, ఆ కేసు ప్రస్తుతం తమ పరిధిలో లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టారన్న వ్యాఖ్యలపై కలెక్టర్‌, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ విచారణ చేస్తున్నారని, జేసీపై చర్యలు తీసుకునే హక్కు కలెక్టర్‌కు ఉంటుందని ద్వివేది చెప్పారు.