ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్, - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్,


అమరావతి, మే 28 (way2newstv.com
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒకే విమానంలో ప్రయాణం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ, రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వీరికి ఆహ్వానం అందింది. 


ప్రధాని ప్రమాణానికి నరసింహన్ , జగన్, కేసీఆర్, 

ఇదే రోజున అమరావతిలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్, గవర్నర్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా వెళ్లేందుకు సిద్ధమైతే ముగ్గురు ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది.