10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సిబ్బంది
షాద్ నగర్, మే17, (way2newstv.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇంటి నెంబర్ జారీకోసం 10వేల రూపాయలు డిమాండ్ చేసిన అడ్డంగా దొరికిపోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణానికి చెందిన ప్రముఖ దంతవైద్యుడు నరేంద్ర కృష్ణ తన ఇంటి నెంబర్ కోసం గత రెండు నెలలుగా మున్సిపాలిటీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసిబి దాడి
ఈ నేపథ్యంలో ఇంటి నెంబర్ కేటాయింపు కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డాక్టర్ నరేంద్ర కృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈరోజు వలపన్ని మున్సిపల్ సిబ్బందిని పట్టుకున్నారు. ఈ వ్యవహారం వెనుక మున్సిపల్ సిబ్బంది శేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నట్లు స్పష్టం అవుతుంది.