కొండలపైనే తెల్లారుతున్న బతుకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొండలపైనే తెల్లారుతున్న బతుకులు

విశాఖపట్టణం, మే 7,(way2newstv.com)
కొండవాలు ప్రాంతంలో జీవిస్తున్న పలు కుటుంబాలు అల్లాడుతున్నాయి. న్నపాటి వర్షం కురిస్తే చాలు కొండ ప్రాంత వాసుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఎటువైపు నుంచి కొండరాయి దొర్లి నెత్తిన పడుతుందో, ఎక్కడ రిటైనింగ్‌వాల్‌ కూలుతుందో తెలియని పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు లక్ష మందికి పైగా పేద, మధ్యతరగతి ప్రజలు వారి పరిస్థితిని బట్టి కొండ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. ఎక్కువమంది పేదలు కావటంతో కొండలను ఆశ్రయించి నిర్మాణాలు చేసుకున్నారు. అంతేగాక మరికొన్ని కుటుంబాలవారు తక్కువ అద్దెల కోసం కొండలపైకి చేరి నివాసం ఉంటున్నారు. గూడులేని నిరుపేదలు కొద్ది స్థలం కనబడితే చాలు ప్రమాదమని తెలిసినా లెక్కచేయకుండా కొండలపైనే ఇళ్లు నిర్మించుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. దీంతో వారికి 'బండ'లే వారి పాలిట గుది 'బండ'లుగా మారుతున్నాయి. ఇక తుపాన్‌ల సమయంలో కొండ ప్రాంతంలో నివసించే వారు ఏ రాళ్లు వచ్చి ఇంటిపై పడతాయో, ఏ రిటైనింగ్‌ వాల్‌ కూలుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. క్రిందటి ఏడాది నాలుగు స్తంభాల సెంటర్‌ కొండ ప్రాంతంలో ఆరు బయట మంచం మీద నిద్రిస్తున్న వ్యక్తిపై కొండరాయి పడటంతో నిద్రలో మంచంమీదే మృతిచెందాడు. సితార థియేటర్‌ ఎదురుగా పెద్ద కొండ చరియ విరిగిపడిన సంఘటన కూడా చోటుచేసుకుంది. 


కొండలపైనే తెల్లారుతున్న బతుకులు

కొంతమంది కొండపై కొత్తగా ఇంటి నిర్మాణం కోసం ఫిల్లర్లు నిర్మించేందుకు పునాదుల కోసం కొండను తవ్వుతున్న సమయంలో రాళ్లు జారి కిందగా వున్న ఇళ్ళపై పడి ప్రమాదాలూ జరుగుతున్నాయని అంటున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌ వద్ద రిటైనింగ్‌వాల్‌ జారి కింద వున్న ఇళ్ళపై, తాగునీటి పైప్‌లైన్లపై కూడా పడటంతో పైపులైన్లు మార్చాల్సిన దుస్థితి నెలకొందని చెబుతున్నారు. నానుడు వర్షాలకు కొండ ప్రాంతంలోని రిటైనింగ్‌ వాల్స్‌ పడిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. క్రిందటి యేడాది వర్షాలకు రాము క్వారీ, కొండబడి ఎదురుగా, కబేళా రోడ్డు, రావిచెట్టు సెంటర్‌ కొండ ప్రాంతాల్లో రిటైనింగ్‌ వాల్స్‌ కూలాయని స్థానికులు చెబుతున్నారు. కూలిపోయిన రిటైనింగ్‌వాల్స్‌, శిథిలమైన మెట్లు, సైడు డ్రెయిన్లు కూడా మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారుకొండ కూలిపోవడంతో ... అక్కడ నుంచి ఖాళీ చేయలేక... ఉండను లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అద్దెలు కట్టలేక...తలదాచుకునేందుకు నీడ లేక..చాలా కుటుంబాలు కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని చినగదిలి.. పెదగదిలి.. దీనదయాల్‌పురం, తోటగరువు, ఆరిలోవ, గణబాబునగర్‌, సుందరయ్యనగర్ ఇలా అనేక ప్రాంతాలలో కొండలపై స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. అయితే కొండలపై బతుకులు దిన దిన గండంగా మారాయి. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో...ఎటునుంచి ఏ బండరాళ్లు వచ్చి పడతాయో తెలియని పరిస్థితి. ఇటీవల కాలంలో హనుమంతువాక వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొండవాలు ప్రాంతం కూలిపోయింది. ముందు భాగం మాత్రమే కూలడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ జంక్షన్ నుంచి వంద మీటర్ల వరకూ రక్షణ గోడ నిర్మించడానికి జీవీఎంసీ పనులు చేపట్టింది. దీంతో మరింతగా కొండ ప్రాంతం కూలడం ప్రారంభించింది. ఈ పరిణామంతో అధికారులు అక్కడ జీవిస్తున్న వారిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో అక్కడున్నవారు ఎక్కడకు వెళ్లాలంటూ వాపోతున్నారు. ఏదో ఒక నిలువ నీడ చూపితే ఇక్కడ నుంచి వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా... పాలకులు, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.