ఓటుకు నోట్లు.. కడప, మల్కాజ్ గిరి స్థానాల్లో రూ.100 కోట్లకు పైగా ఖర్చు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓటుకు నోట్లు.. కడప, మల్కాజ్ గిరి స్థానాల్లో రూ.100 కోట్లకు పైగా ఖర్చు!


హైదరాబాద్, జూన్ 18 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మొత్తంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చని తెలిపింది.  తాజా సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి. పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించడం కోసం అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని ఉపయోగించుకున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తంగా రూ.55,000 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) నివేదిక పేర్కొంటోంది. 1998లో ఎన్నికల ఖర్చు రూ.9,000 కోట్లుగా ఉండటం గమనార్హం.  రూ.55,000 కోట్లలో 20 నుంచి 25 శాతం అంటే రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు డైరెక్ట్గా ఓటర్లకు నగదు రూపంలో పంపిణీ జరిగినట్లు సీఎంఎస్ పేర్కొంది. 


ఓటుకు నోట్లు.. కడప, మల్కాజ్ గిరి  స్థానాల్లో రూ.100 కోట్లకు పైగా ఖర్చు!

ఇక 30 నుంచి 35 శాతం (రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్లు) ప్రచారం, పబ్లిసిటీ కార్యక్రమాలకు ఖర్చు అయినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్  ఎన్నికల నిర్వహణకు రూ.10 వేల నుంచి రూ.12,000 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందని తెలిపింది. తెలంగాణలో 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.5,000 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందని సీఎంఎస్ అంచనా వేసింది. ఇక ఈ ఏప్రిల్లో 16 మంది ఎంపీలకు రూ.400 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్  లో  అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మొత్తంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చని తెలిపింది. పార్టీలు దేశంలోని 75 నుంచి 85 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఖర్చు చేశాయని సీఎంఎస్ తెలిపింది. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 8 నియోజకవర్గాల్లో రూ.100 కోట్లకు పైగానే ఖర్చు అయ్యిందని పేర్కొంది. తెలంగాణలోని చేవెళ్ల, మల్కాజ్ గిరి, నల్గొండ లోక్ సభ నియోజకవర్గాల్లో రూ.100 కోట్లకుపైగా ఖర్చు నమోదయ్యిందని అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్  ని కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులలో కూడా రూ.100 కోట్లకుపైగా ఖర్చు అయ్యి ఉంటుందని పేర్కొంది.