ఘనంగా ఈద్ ముబారక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఘనంగా ఈద్ ముబారక్


హైద్రాబాద్, జూన్ 5 (way2newstv.com)
ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినం శాంతికి చిహ్నమని ఇస్లాం మతపెద్దలు చెబుతుంటారు. నెల రోజులుగా చేస్తున్న ఉపవాసాలకు నేడు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో మహ్మదీయ సోదరులు  రంజాన్ పర్వదినం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభకాంక్షలు తెలుపుకుంటారు. 


ఘనంగా ఈద్ ముబారక్
రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదులను అందంగా అలంకరిచారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, తెలుగు రాష్ట్రాల సీఎంలు ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదులలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇస్లాంలో నమాజ్ పఠించడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నియమ నిష్టలతో కూడిన నమాజ్ చేయడం ద్వారా వ్యక్తి పరిపూర్ణంగా వికసిస్తాడని వారు భావిస్తారు. రంజాన్ మాసాన్ని అల్లా తరపునుంచి కానుకలు అందుకునే సమయంగా పరిగణిస్తుంటారు. ఇస్లాంకు చెందిన ఐదు మూల స్థంభాలలో నమాజ్‌ను ఒకటిగా భావిస్తుంటారు. ఇస్లాం 5సార్లు నమాజ్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఐదు పద్దతుల్లోచేసే నమాజ్‌కు వివిధ పేర్లు కూడా ఉన్నాయి.