హైద్రాబాద్, జూలై 19 (way2newstv.com)
రాష్ట్రంలో కొన్ని కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్తో పాటు మీర్పేట్, జిల్లెలగూడను కలిపి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లుగా కొత్త మున్సిపాలిటీ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న 6 కార్పొరేషన్లతో కలిసి రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరుకుంది. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం - 2019పై చర్చ సందర్భంగా శుక్రవారం ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి కారణాలను కూడా సీఎం కేసీఆర్ వివరించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కొత్త కార్పొరేషన్ల మధ్య సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయని చెప్పారు.
తెలంగాణలో కొత్తగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు
నిజాంపేటలో ఎదురవుతున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిజాంపేటలో గత కొన్నేళ్లలో బహుళ అంతస్తుల భవనాలు భారీ సంఖ్యలో వెలిశాయని తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం లాంటివి చోటేచేసుకుంటే.. కనీసం ఫైర్ ఇంజిన్లను పంపడానికి కూడా జీహెచ్ఎంసీకి అధికారం లేకుండా పోతోందని సీఎం వివరించారు. కొత్త మున్సిపల్ చట్టంలో ఈ మేరకు మార్పులు చేశామని.. మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. స్థానిక శాసనసభ్యుల అభ్యర్థనల మేరకు ఈ 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇకపై మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయని వెల్లడించారు. పారదర్శకంగా అనుమతులు లభించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు.
కొత్త వాటితో కలిపి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు
1) గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (66 వార్డులు)
2) కరీంనగర్ (60)
3) రామగుండం (50)
4) నిజామాబాద్ (60)
5) ఖమ్మం (60)
6) బడంగ్పేట్ (32)
7) బండ్లగూడ జాగీర్ (22)
8) మీర్పేట్ (46)
9) బోడుప్పల్ (28)
10) పీర్జాదీగూడ (26)
11) జవహర్ నగర్ (28)
12) నిజాంపేట్ (33)
13) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ -150)
ఈ 13 మున్సిపల్ కార్పొరేషన్లు కాకుండా రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి.
Tags:
telangananews