ముప్పేట దాడిలో చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముప్పేట దాడిలో చంద్రబాబు


గుంటూరు, జూలై 2, (way2newstv.com)
అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు.కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో బిజీగా వున్నారు. మిన్ను విరిగి మీద పడినా కూల్ గా తన రాజకీయాన్ని నడిపించాలని ఆయన చూస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏవైనా … ఎవరు అధికారం చేపట్టినా ఎన్నికల ముందు ఎన్ని చెప్పినా పదవిలోకి వచ్చాకా తమ పంథాలో తాము సాగిపోతాయి. గత ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసి అధికారం హస్తగతం అయ్యాకా వాటిని విస్మరించడం రివాజు. వారు చేసిన తప్పుడు పనులకు అక్రమాలకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పారంటూ చెప్పుకురావడం సర్కార్ లో ఉన్నవారు రొటీన్ డైలాగ్స్ గానే మిగిలిపోతాయి. అసెంబ్లీ వంటి చట్టసభల్లో ఆ ఆరోపణలపై అధికారపార్టీ ప్రస్తావించినప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు విచారణ జరిపి ఎందుకు తమపై చర్యలు చేపట్టడం లేదంటూ విపక్షం నిలదీయడం కూడా సర్వ సాధారణం అయిపొయిందితాజా పరిణామాలపై చంద్రబాబు అండ్ టీం కలవరపడుతుంది.

ముప్పేట దాడిలో చంద్రబాబు

ఇప్పటికే గతంలో వైఎస్సార్ సైతం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వం చేసిన పనులపై విచారణ చేయలేదని గుర్తు చేస్తుంది. ఇది పూర్తిగా కక్ష సాధింపే అంటూ ఆరోపిస్తుంది. రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ దూకుడును ఎలా అడ్డుకోవాలా అని యోచిస్తోంది.వైసిపి, బిజెపి లనుంచి ఎదురౌతున్న సమస్యలను బాబు ఎదుర్కొనే తీరుపైనే క్యాడర్ లో ధైర్యం ఏర్పడుతుంది. కనుక ఆచితూచి వైసిపి రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం అయ్యారు.పొరుగు రాష్ట్రం తో మంచి సంబంధాలు అభివృద్ధి కి సోపానాలు అని ఎపి ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. జగన్ ఆలోచనలకు తగినవిధంగానే కెసిఆర్ స్పందించి ముందుకు వచ్చారు. ఒకరకంగా టి సిఎం ఈ విషయంలో మరింత చొరవ చూపుతున్నారు. ఎన్నికల ముందు కెసిఆర్ ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఆ అంశాన్నే తన ఎన్నికల ప్రధాన విమర్శనాత్మకంగా మార్చుకుని టిడిపి అధినేత చంద్రబాబు ఫ్యాన్ స్విచ్ తెలంగాణ లో ఉందంటూ దాడి మొదలు పెట్టారు. అయితే ప్రజలు ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు అవే ఆరోపణలు పదేపదే చేయడం ద్వారా కెసిఆర్ ఎపి ని వంచించి లబ్ది పొందుతున్నారనే వాదన గట్టిగా ప్రజల్లో నాటే ప్రయత్నం మొదలు పెట్టారు బాబు బృందం.మన భవనాలు వారికి ఇచ్చేశారు, మన నీళ్ళు వాళ్ళు పట్టుకుపోయే కుట్ర జరుగుతుంది. ఇలా ప్రతి అంశం జనం మదిలో చొప్పిస్తే వచ్చే ఎన్నికల నాటికి తమకు సానుకూలం అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు లెక్కగా కనిపిస్తుంది. సెంటిమెంట్ అస్త్రాలతో పూర్తి పాజిటివ్ ఓటుతో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పై నెగిటివ్ రావడం ఇప్పట్లో సాధ్యం కాదు కనుక ఈ రూట్ లో వెళ్లడమే సరైనదని బాబు ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వ్యూహాన్ని ఎపి సీఎం జగన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.