గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్‌ జూలై 18(way2newstv.com):
సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శాసనసభ వాయిదా పడిన వెంటనే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ను నియమించిన తర్వాత గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. 
గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీటి వివరాలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు సహా ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.