అభివృద్ధి కోసమే పురపాలకం... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అభివృద్ధి కోసమే పురపాలకం...

హైద్రాబాద్, జూలై 18 (way2newstv.com)
తెలంగాణ పురపాలక చట్టం-2019 బిల్లును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సాయంత్రం వరకూ ఈ బిల్లుపై సవరణలను స్వీకరించనున్నారు. గురువారం ఈ బిల్లుపై చర్చ జరగనుంది. పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకువస్తున్నాం. 
అభివృద్ధి కోసమే పురపాలకం...

ఇది సభ్యులకు, ప్రజలకు తెలుసు. పదిగా ఉన్న జిల్లాలను 33 జిల్లాలను చేశాం. అనేక విభాగాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. 5వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 65 మున్సిపాలిటీల ఉండే. ఇప్పుడు 142 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలన్నా.. శాసనసభ ఆమోదించాల్సిందే. ప్రగతి నిరోధక శక్తులు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి. ల్యాండ్ మాఫియా విజృంభించి దుష్ట కార్యక్రమాలకు తెరలేపారు. అభివృద్ధి క్రమపద్ధతిలో జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువస్తున్నాం. పురపాలక ఎన్నికలు జరపాలనే సంకల్పంతోనే ఈ బిల్లును తీసుకువస్తున్నామన్నారు. త్వరలోనే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ. 2 వేల 74 కోట్లు ఇస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో జారీచేసిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.