ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్

అమరావతి, జూలై 23, (way2newstv.com)
ఏపీ శసనసభలో మంగళవారం తొలి సస్పెన్షన్ జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సభాపతి సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసారు. 
ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ 

ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు.  ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. సభలోనే ఉండి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. అయితే, వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు