ల్యాండ్ వివరాల సమాచారంతో భమ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ల్యాండ్ వివరాల సమాచారంతో భమ్

అమరావతి, జూలై 28, (way2newstv.com)
ఏపీకి సంబంధించి భౌగోళిక సమాచారం మొత్తం డిజిటలైజ్ చేయనున్నారు. ఈ  ల్యాండ్‌హబ్‌లో అన్ని రకాల భూముల వివరాలు పొందుపరచనున్నారు. భూముల సమగ్ర నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక హబ్‌ను ఏర్పాటు చేయాలని ఆధార్ యుఐడిఎఐ తరహాలో ఒక అధీకృత ఏజెన్సీ చేయాలనే  ఆలో్చనలో సర్కారు ఉంది. రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్, మున్సిపల్ అర్బన్ ల్యాండ్ సర్వే వివరాలన్నీ ల్యాండ్‌హబ్‌లో చేర్చనున్నారు . ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు మొత్తం ఈ హబ్ ద్వారా  ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరాలు పొందుపరుస్తారు. మొత్తం 1,60,000 చదరపు కిలోమీటర్ల రాష్ట్ర భౌగోళిక ప్రాంతమంతా ఈ ల్యాండ్‌హబ్ పరిధిలోకి రానున్నాయి. రైతులకు ప్రభుత్వం తరపున అందే ప్రతి ప్రయోజనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు డిజిటలైజ్ ప్రక్రియను చేపట్టనున్నారు. 
 ల్యాండ్ వివరాల సమాచారంతో భమ్ 

కొత్త అర్బన్ మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల విషయంలో పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య విరుద్ధమైన భౌగోళిక సరిహద్దులు లేకుండా చూస్తారు. రెవెన్యూ డివిజన్‌లు ఎన్ని ఉంటే పోలీస్ డివిజన్లు కూడా అన్నే ఉండనున్నాయి. ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉండగా, వీటి సంఖ్యను పెంచే విషయంలో రెండు శాఖల మధ్య సమన్వయం చేయనున్నారు. ఈ-క్రాప్ విధానంలో వ్యవసాయం చేసే వారికే రుణాలు అందించడం ద్వారా భూమి పట్టాదారులకు సమస్యలు తెలెత్తకుండా వెబ్ ల్యాండ్‌లో ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురానున్నారు. రెండేళ్లలో రెవెన్యూ శాఖలో 13 సంస్కరణలు చేపట్టిన సర్కార్,  మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన ఇతర పట్టాదారులకు సంబంధించి మరోమారు 1బిలు అందించి వారి సమస్యలను పరిష్కస్తారు. రికార్డులన్నింటికీ డిజిటల్ లాకర్ ఉండాలని, వాటిలో ఏ మార్పులు జరగాలన్నా సవరణలకు ఆర్డీవోలు మాత్రమే అధారిటీగా ఉంటాయి.మండల కార్యాలయం నుంచి సిసిఎల్ వరకు ప్రతి ఫైలును ఆన్‌లైన్ చేస్తారు. 6.4 లక్షల ఎకరాల భూమిని ఇటిఎస్ ద్వారానే సర్వే చేయడమే కాకుండా... డ్రోన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతున్నారు.