రాజధాని మారదు.--- లక్ష్మీ పార్వతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధాని మారదు.--- లక్ష్మీ పార్వతి

హైద్రాబాద్ ఆగస్టు 28 (way2newstv.com)
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మహిళానేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని, రైతుల దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టిందని ఆరోపించారు. 
రాజధాని మారదు.--- లక్ష్మీ పార్వతి

విశాఖపట్నంలో ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానిని దొనకొండకు మార్చుతున్నట్టు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.దొనకొండలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, నారా లోకేశే అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నామంటూ చెప్పినా వారిని రాజధాని ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.