శ్రీకాకుళం, ఆగస్టు 14 (way2newstv.in)
శ్రీకాకుళం జిల్లావంగర మండలం కోతులగుమ్మడ గ్రామంలో ఆరు ఏనుగులు గుంపు సంచారం కలకలం రేపింది. ఏనుగుల గుంపు భయంతో రైతులు,స్థానికులు భయం గుప్పెట్లో మసులుతున్నారు.
పోలాలపై విరుచుకపడ్డ ఏనుగుల గుంపు
ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా నుండి వచ్చాయి. గ్రామాల్లో ఉన్న వరి పంట పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపి తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.