ముంబై, ఆగస్టు 16, (way2newstv.com)
దేశీ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. శుక్రవారం లాభనష్టాల మధ్య సయ్యాటలాడింది. అయితే చివరకు సూచీలు స్వల్ప లాభాలవైపే మొగ్గుచూపాయి. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాపడటం ఇందుకు కారణం. మరోవైపు టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల నష్టాలతో లాభాలు పరిమితమయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడేలో 337 పాయింట్ల మేర పతనమైంది. అలాగే నిఫ్టీ కూడా 10,924 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అయితే ఆటో, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 37,350 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,048 పాయింట్ల వద్ద ముగిసింది.
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో యూపీఎల్, పవర్ గ్రిడ్, మారుతీ, యస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యూపీఎల్ దాదాపు 5 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో టీసీఎస్, వేదాంత, హెచ్సీఎల్ టెక్, బీపీసీఎల్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ దాదాపు 2 శాతం క్షీణించింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. ఐటీ, ఫార్మా, మెటల్ ఇండెక్స్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 1.61 శాతం పెరుగుదలతో 59.19 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 1.67 శాతం పెరుగుదలతో 55.39 డాలర్లకు ఎగసింది.
అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 18 పైసలు లాభంతో 71.09 వద్ద కదలాడుతోంది.