మిషన్ భగీరధకు కేంద్ర ప్రశంసలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మిషన్ భగీరధకు కేంద్ర ప్రశంసలు

న్యూఢిల్లీ ఆగస్టు 26, (way2newstv.com
కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో జల్ జీవన్ మిషన్ పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. రాష్ట్రం తరుపున దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాం. – ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా  చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ను కార్యక్రమాన్ని ప్రకటించారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అర్.డబ్లూ.ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.  కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన దీనిపై ఈ రోజు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.  
 మిషన్ భగీరధకు కేంద్ర ప్రశంసలు 

తెలంగాణలోని మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలను తొలగించడంతోపాటు ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయడం లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గారు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారు.   మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేపట్టింది. 2024 వరకు పూర్తి చేయాలని  లక్ష్యంగా పెట్టుకుంది.– కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్  ని వ్యక్తిగతంగా కలిసి ఈరోజు వినతిపత్రాన్ని ఇచ్చామని అయన అన్నారు. – అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఉన్న మిషన్ భగీరథ కార్యక్రమం... కేంద్ర ప్రభుత్వం  చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం ఒక్కటే కాబట్టి నిధుల పరంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరాం.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ కింద... తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని గతంలోనూ కోరాము. ఈ అంశంపై ఈ ఏడాది జూన్ 11న ఢిల్లీలోనే మంత్రిగారికి స్వయంగా లేఖ ఇచ్చాం.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్యక్రమం అంచనా వ్యయం రూ.40,028 కోట్లు. దీంట్లో 80 శాతం నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో... మిగిలిన 20 శాతాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ చొరవకు అభినందనలు తెలిపారు. – మిషన్ భగీరథ కార్యక్రమం గజ్వేల్ సెగ్మెంట్ను ప్రధానమంత్రి మోదీగారు 2016 ఆగస్టు 7న స్వయంగా ప్రారంభించారు. తాగునీటి సరఫరాలో తెలంగాణ ప్రభుత్వ చొరవను అభినందించారు  అన్ని రాష్ట్రాలకు మార్గదర్శంగా సీఎం కేసీఆర్గారు చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం హడ్కో అవార్డు కూడా ఎంపికైంది.  తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రూ.40,028 కోట్లతో చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రారంభించినందున... మిషన్ భగీరథకు సపోర్టు చేసేలా 50 శాతం నిధులను భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరాం.   మిషన్ భగీరథ కార్యక్రమం నిర్వహణకు ప్రతి ఏటా అయ్యే రూ. 2,110 కోట్ల మొత్తం అవసరమవుతుంది. నిర్వహణ ఖర్చు మొత్తాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని కోరామని ఎర్రబల్లి తెలిపారు.