న్యూఢిల్లీ ఆగష్టు 26 (way2newstv.com)
కాంగ్రెస్ సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం ఇవాళ తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. చిదంబరం ఇప్పటికే ఆరస్టైనందున పిటిషన్ చెల్లదని పేర్కొంది.
చిదంబరానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు
ఐతే ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Tags:
all india news