కృష్ణమ్మకు అనూహ్యంగా పెరిగిన వరద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కృష్ణమ్మకు అనూహ్యంగా పెరిగిన వరద

శ్రీశైలం,  ఆగస్టు 7 (way2newstv.com)
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశాయలకు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతుండగా, జూరాల మీదుగా నాలుగున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.  మంగళవారం వరకూ రెండు లక్షల క్యూసెక్కులకు అటూఇటుగా సాగిన వరద నీటి ప్రవాహం రెట్టింపు కావడంతో, అధికారులు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
కృష్ణమ్మకు అనూహ్యంగా పెరిగిన వరద

దీంతో దాదాపు 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతోంది.  ఇదే వరద ప్రవాహం కొనసాగితే, గురువారం  సాయంత్రం లేదా శుక్రవారం నాడు శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరవాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నికరంగా 2.40 లక్షల క్యూసెక్కల నీరు నిల్వ అవుతోంది.  పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 871 అడుగులకు నీరు చేరుకుంది  దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రారంభమైంది.  జలాశయంలో 215 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యముండగా, ప్రస్తుతం సుమారు 150 టీఎంసీల నీరుంది.