నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై, ఆగస్టు 7 (way2newstv.com)
దేశీ స్టాక్‌మా ర్కె ట్ బుధవారం నష్టపోయింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒకవైపు రెపో రేటు తగ్గించినా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపింది. రేట్ల కోతతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్నింగ్ సెషన్‌లో లాభాల్లో ఉన్న సూచీలు చివరకు నష్టాలను మిగుల్చుకున్నాయి. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టంతో36,690 వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 10,855 వద్ద ముగిసింది. 
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
మార్కెట్ హైలైట్స్.. 
✺ నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, సిప్లా, యస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంక్ దాదాపు 2 శాతం పెరిగింది. 
✺ అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఇండియాబుల్స్ ఫైనాన్స్ ఏకంగా 13 శాతానికిపైగా పడిపోయింది. 
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. దాదాపు 3 శాతం క్షీణించాయి. 
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.36 శాతం క్షీణతతో 58.73 డాలర్లకు తగ్గింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.21 శాతం క్షీణతతో 53.52 డాలర్లకు తగ్గింది. 
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. 70.86 వద్ద కదలాడుతోంది.