అడగుడుగునా జల్లెడ పడుతున్న సైనికులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడగుడుగునా జల్లెడ పడుతున్న సైనికులు

న్యూఢిల్లీ, ఆగస్టు 5  (way2newstv.com):
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, ప్రత్యేక హక్కులను కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను సోమవారం కేంద్ర రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 విషయంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నా, ఎంతవరకు ముందుకు వెళ్తుందనే సందేహం ఇప్పుడు నెలకుంది. కశ్మీర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన కేంద్రం, భారీగా బలగాలను మోహరించింది. గత నాలుగు రోజుల్లో దాదాపు 35 వేల మంది సైనికులను కశ్మీర్‌కు తరలించారు. తాజాగా, మరో 8 వేల మంది సీఆర్పీఎఫ్ దళాలను తరలిస్తోంది. శ్రీనగర్‌కు కూడా అదనపు దళాలు తరలించారు. కశ్మీర్‌లో ప్రస్తుతం ప్రతి ఐదుగురు పౌరులకు ఒక్కరు చొప్పున జవాన్లు కాపాలా కానస్తున్నారు. 
అడగుడుగునా జల్లెడ పడుతున్న సైనికులు

ఆర్టికల్ 370 రద్దుతో పార్లమెంటులో చేసే చట్టాలు ఇక జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయి. సమాచార హక్కు చట్టం, ఇకపై జమ్మూకశ్మీర్‌‌కు సంబంధించిన ఆర్టికల్ 370 ఉండదు. దానికి పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేదు. క్యాబినెట్ ఆమోదించగానే రాష్ట్రపతి అంతే వేగంగా ఆమోదించి, సంతకం చేశాడు. దీనివల్ల ఇకపై అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి ఉండదు. ప్రత్యేక రాజ్యాంగాలు, చట్టాలు, జెండాలు, ఎజెండాలు, ఆంక్షలు, ప్రత్యేక పౌరసత్వ నిబంధనలు ఉండవు సరికదా, ఆర్టికల్ 35ఏ కూడా ఆటోమేటిక‌్‌గా రద్దయిపోయింది. అయితే పుదుచ్చేరి, ఢిల్లీ తరహాలో జమ్మూ కశ్మీర్ ఓ రాష్ట్రంగా ఉండి, దానికి శాసనసభ కూడా ఉంటుంది. లద్దాఖ్ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం దానికి ఓ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండి, కేంద్రం తరఫున తను పాలిస్తాడు. ఇక, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. వీధుల్లో సభలు, సమావేశాలు, ధర్నాలపై నిషేధం కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత కల్పించారు. కర్ఫ్యూ విధించడం లేదని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రకటన చేసినప్పటికీ అంతటా అదే పరిస్థితి ఉంది. శుక్రవారం నుంచే అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులను రాష్ట్రం నుంచి వెళ్లి పోవాలని కేంద్రం హెచ్చరికలు జారచేసింది. కశ్మీర్‌కు 10 వేల మంది కేంద్ర బలగాలను తరలిస్తూ జులై 25న కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసిన నాటి నుంచే ప్రజల్లో ఏదో జరగబోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఆగస్టు 1 న కశ్మీర్‌లోకి మరో పాతికవేల మంది సైనికులను మోహరించింది. దేశ విభజన తర్వాత జమ్మూకశ్మీర్ భారత్‌లో పాక్షికంగా విలీనమైంది. తాజా పరిణామాలతో పూర్తిగా ఆ ప్రక్రియ జరిగింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి అంగీకరించబోమని, దానిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని దీని ద్వారా అంతర్జాతీయ సమాజానికి భారత్ సందేశాన్ని పంపినట్టయ్యింది. ఈ అంశంపై పది రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను మోదీ సర్కారు తిరస్కరించింది. కశ్మీర్ మాది, మేం కాపాడుకుంటాం, మేం వదిలిపెట్టబోమని మోడీ సంకేతాలు ఇచ్చారు. అయితే, గతంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ ఇచ్చిన ఓ సలహా కశ్మీర్ చిచ్చుకు ఆజ్యం పోసింది. భారత్‌లో కశ్మీర్ విలీనం ప్రజాభిప్రాయంతో జరగాలనేది ఓ ప్రశ్న.. దీనికి ఇప్పుడే కాదు… ఎప్పుడూ సమాధానం లభించదు. ఎందుకంటే సార్వభౌమ దేశం ఒక ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని వదులుకోదు.