రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

మల్లన్న సాగర్ బాధితుల పిటిషన్ పై విచారణ
హైదరాబాద్, ఆగస్టు 20 (way2newstv.com):
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో... నిర్లక్ష్యం వహించిన ఆర్డీవో, తహసీల్దార్కు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.  సిద్దిపేట జిల్లా తోగుట ఆర్డీవో, తహశీల్దార్ కు రెండు నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానాతో పాటు సస్పెన్షన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

తోగుట ఆర్డీవో డి.విజేందర్ రెడ్డి, తహశీల్దార్ ప్రభు లకు శిక్ష విధించింది. గతంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన విషయ తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, భూ నిర్వాసితులకు న్యాయం చేయలేదని మల్లన్న సాగర్ బాధితులు మరోసారి కోర్టు ను ఆశ్రయించారు. పిటిషన్ పై విచారించిన కోర్ట్ అధికారులు శిక్ష ఖరారు చేసింది.