ఐటీ కంపెనీల్లో జోరుగా ఉద్యోగాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐటీ కంపెనీల్లో జోరుగా ఉద్యోగాలు

హైద్రాబాద్,  ఆగస్టు 2, (way2newstv.com)
ఐటీలో మళ్లీ జోష్‌ పెరిగింది. గత మూడేళ్లుగా కొంత స్తబ్దుగా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా నియామకాల జోరు పెంచాయి. నాలుగేళ్ల క్రితం ఐఐటీ విద్యార్థులకు రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనాలు ఆఫర్‌ చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గోల్డ్‌మెన్‌శాక్స్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు ప్రతిభావంతుల కోసం మన ఐఐటీల ముందు క్యూ కట్టాయి. సగటున రూ.కోటి వార్షికవేతనం ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాలు, జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్‌ (దక్షిణ భారత) డైరెక్టర్‌ ఒకరు వెల్లడించారు. 
ఐటీ కంపెనీల్లో జోరుగా  ఉద్యోగాలు

మునుపెన్నడూ లేని విధంగా అనేక బహుళజాతి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాయని ఆయన వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ చేసింది. జేపీ మోర్గాన్‌ చేజ్‌ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్‌ చేసింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయని, విద్యార్థులకు భారీ ఎత్తున అవకాశాలు ఉంటాయని, కంపెనీల నుంచి నియామక తేదీలు కావాలంటూ లేఖలు వస్తున్నాయని సీబీఐటీ ప్లేస్‌మెంట్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌ఎల్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. గత మూడు నాలుగేళ్లుగా టాప్‌ టెన్‌ కాలేజీల్లో నియామకాలకు మాత్రమే పరిమితమైన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్‌ వంటి కంపెనీలు ఈ ఏడాది ద్వితీయ శ్రేణి కాలేజీల్లో నియామకాలకు ప్లాన్‌ చేసుకుంటున్నాయి.  మొదటిసారిగా అమెరికాకు చెందిన అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, సిటీ గ్రూప్, పేపాల్‌ వంటి సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రముఖ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లకు రావడం విశేషం. ఒక్కో విద్యార్థికి ఒకేసారి ఐదారు ఉద్యోగావకాశాలు కూడా వస్తు న్నాయి. జూలై మొదటి వారంలో ప్రారంభమైన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ జోరు సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐఐటీలు, నిట్‌లు మాత్రమే కాకుండా మంచి ర్యాంకింగ్‌ కలిగి ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ నియామకాల ప్రక్రియ ఊపందుకుంది.  మూడేళ్లుగా పాక్షిక నియామకాలకు పరిమితమైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, క్యాప్‌ జెమినీ, యాక్సెంచర్‌ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల నియామకానికి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి.  ఈ ఏడాది ఐఐటీ విద్యార్థుల పంట పండింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ వారణాసి (బీహెచ్‌యూ) విద్యార్థికి ఒక కంపెనీ రూ.1.52 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. ఈ సంస్థ ఇంకా అధికారికంగా విద్యార్థి, కంపెనీ పేరు వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జోమాటో, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు ఈ ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్‌ చేశాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి అత్యధికంగా (ఇప్పటివరకూ) రూ.1.5 కోట్ల వార్షిక వేతనాన్ని ఓ కంపెనీ ఆఫర్‌ చేసింది. ఈ ఐఐటీలో ఆదిత్య బిర్లా, అబోడ్, అమెజాన్, క్యాటర్‌ పిల్లర్, మారుతీ సుజుకీ సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. ఐఐటీ రూర్కీలోనూ ఓ విద్యార్థికి ప్రపంచ ప్రసిద్ది గాంచిన కంపెనీ రూ.1.5 కోట్ల వేతనాన్ని ఆఫర్‌ చేసింది. ఈ ఐఐటీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్‌శాక్స్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, వాల్‌మార్ట్‌ సంస్థలు ఉద్యోగాలు ఆఫర్‌ చేశాయి. ఐఐటీ ముంబైలో విద్యార్థులను నియమించుకోవడానికి 15 కంపెనీలు పోటీ పడ్డఈ ఏడాది హైదరాబాద్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాలు, జాబ్‌ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నాస్కామ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. సీబీఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ రూ.41 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌ చేసింది. జేపీ మోర్గాన్‌ చేజ్‌ కంపెనీ ఈ కాలేజీలో 40 మందికి పైగా విద్యార్థులకు భారీ వేతనాలను ఆఫర్‌ చేసింది