ఎన్నికల ప్రణాళిక హామీ దిశా గా మద్యపాన నిషేధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల ప్రణాళిక హామీ దిశా గా మద్యపాన నిషేధం

విజయవాడ ఆగష్టు 21 (way2newstv.com)
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దశలు వారీగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.దీనిలో భాగంగా వచ్చే అక్టోబర్ ఒకటో తేదినుండి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే  రాష్ట్రంలో బెల్ట్ షాప్లను కట్టడి చేసిన  ప్రభుత్వం మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం రాష్ట్రం లో 4500 మద్యం దుకాణాలు ఉండగా  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాలను సుమారు 3500కి కుదించింది.దుకాణాలను కుదించటంతో పాటు ఈ దుకాణాల నిర్వహణకు సుమారు 10000 ల నుంచి 15000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.
ఎన్నికల ప్రణాళిక హామీ దిశా గా మద్యపాన నిషేధం

సేల్స్ సూపర్వైజర్  15000 రూపాయలు,సేల్స్ మేఎన్ కు 10000 ల రూపాయలు జీతాలు గా నిర్ణయించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 357 జిఓ ను జారీచేసింది.రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెబ్సైటు (excise )ద్వారా ఉద్యోగాలకు దరకాస్తు చేఉకోవాలని సూచిస్తూ దారకాస్తు నమూనాను ఉంచింది.దీనితో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు వద్ద కూడా మరికొంతమంది కి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రింగుకి టెండర్ 
మద్యం దుకాణాల ఫై నియంత్రణ లేకపోవడంతో గతంలో మద్యం దుకాణదారులు ఆడిందే ఆట పాడిందే పాట గా కొనసాగి ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లేది.దుకాణాల లైసెన్స్ పొందిన తరువాత అంతా రింగు గా ఏర్పడి ఒకే ధరకు అమ్మాలని నిర్ణయించేవారు.దీనివల్ల వాలు నిర్ణయించిన ధరకే మద్యం కొనాల్సిన పరిస్థితి వినాయగదారులకు కలిగేది.దీనితో పాటు ఇతర రాష్ట్రాలనుంచి నాన్ డ్యూటీ మద్యాన్ని తీసికొనివచ్చి చీప్ లిక్కర్ పేరుతొ విక్రయించేవారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు ప్రజల జేబులు కు చిల్లులు పడేవి.రాష్ట్రంలోని నూతన ప్రభుత్వం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం విక్రయించాలని నిర్ణయించటంతో నకిలకు అడ్డుకట్ట వేయటంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం వినియోగదారులకు లభిస్తుంది.దానితోపాటు సుమారు 1000అరకు మద్యం దుకాణాలు రద్దు అవుతుండటం,బెల్ట్ దుకాణాలు బంద్ కావటంతో ఎక్కడపడితే అక్కడ మద్యం దొరికే పరిస్థితి  ఉండదు.మేజర్ పంచాయితీలు మండలకేంద్రాలు చిన్న చిన్న నగరాలు పట్టణాలకు మాత్రమే దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. దీనితో పాటు ఉదయం 10గంటలనుంచి రాత్రి 10 గంటలు వరకు మాత్రమే దుకాణాలు అందుబాటులో ఉంటాయి. దీనితో ఎప్పుడు పడితే ఎక్కడైనా మద్యం లభించే అవకాశం కనిపించదు.ఇప్పటికే బెల్ట్ దుకాణాలు నియంత్రణ కలిగించటంతో గ్రామాలలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
మద్యాన్ని నిషేదిస్తున్న గ్రామాలు 
రాష్ట్రంలో దశలవారీగా మద్యపానాన్ని నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయించటం దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండంతో గ్రామాలలో ప్రజలు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు.500జనాభా కలిగిన గ్రామంలో కూడా బెల్ట్ దుకాణాలు ఉండటంతో మద్యం ఏరులై పారేది.దీనితో గ్రామాలలో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తేవి.అయితే కొన్ని గ్రామాలలో విద్యావంతులైన యువకులు గ్రామాలలో మద్యం అమ్మకాలను,వాడకాన్ని నిషేదిస్తున్నారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో చాలా రోజుల క్రితం గ్రామంలో అమ్మకాలను,వాడకాలను నిషేదించారు.ఈ మండలం ఈ గ్రామానికి తొలినుంచి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ప్రాధమిక పాఠశాలతో పాటు ఉన్నఆపాఠశాల చాలా కాలం క్రితంనుంచి ఇక్కడ ఉన్నాయి. ఒకఅప్పుడు వర్గ రాజకీయాలకు కేంద్రం గా ఉండే ఈ గ్రామం  ప్రస్తుతం  ఆధ్యాత్మికతతో దేవాలయాల పునరుద్ధరణ,రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో ఉత్తమ గ్రామం గా అభివృద్ధి చెందుతోంది.ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోని మధ్య పాన నిషేదానికి ప్రజలు సహకరిస్తే ఐదు సంవత్సరాల్లో నక్షత్రాల హోటల్ కె మద్యం పరిమితం చేస్తానని ఎన్నికల హామీని ఇచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఆ హామీ ని నిలబెట్టుకోవటం చాలా సులభతరం అవుతుంది.