బెంగళూర్, సెప్టెంబర్ 10 (way2newstv.com)
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో పురోగతి లభించింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోగా.. ఈ ప్రయోగం విఫలమైందనేవార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయోగం 5% మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు ప్రకటించారు.. అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా ఈప్రయోగంలో మరో పురోగతి లభించింది. ఆదివారం ల్యాండర్ జాడను కనిపెట్టిన ఇస్రో.. ఇవాళ దాని పరిస్థితిని గుర్తించింది. హార్డ్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్ విక్రమ్ ముక్కలైపోయి ఉంటుందని చాలామంది నిపుణులు భావించినా.. విక్రమ్ పరిస్థితి యథాతథంగా ఉందని ఇస్రో అధికారులు ప్రకటించారు.
చంద్రయాన్- 2 లో పురోగతి
2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్…ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్గా ఉందని ఇస్రో ప్రకటించింది.నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయ్యింది. ఆర్బిటర్ పంపిన థర్మల్ ఛాయచిత్రాల ద్వారా అదితెలుసుకున్నాం. ల్యాండర్ సింగిల్ పీస్గానే ఉంది. ముక్కలు కాలేదు. త్వరలోనే ల్యాండర్తో కమ్యునికేషన్ను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం అని అధికారులు తెలిపారు. అయితే చందమామపైఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్లనే అంత ఎత్తు నుంచి పడ్డప్పటికీ ల్యాండర్కు ఏమీ కాలేదని తెలుస్తోంది.కాగా విక్రమ్ ల్యాండర్ లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. ఒకవేళ ల్యాండర్ ముక్కలై ఉంటేరోవర్ పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవి. అయితే ఇస్రో చెబుతున్నదాని ప్రకారం ల్యాండర్ సజావుగా ఉంది కాబట్టి.. అతి త్వరలోనే దాని నుంచీ సిగ్నల్స్ అందుకునే అవకాశాలున్నట్లుసమాచారం. ఇక ఒక్కసారి సిగ్నల్స్ అందితే అందులో నుంచి రోవర్ను బయటకు తెప్పించేందుకు కూడా వీలవుతుంది. తద్వారా చంద్రయాన్ 2 విజయం అవుతుంది.
Tags:
News