రుణమాఫి హామీ తెదేపాదే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రుణమాఫి హామీ తెదేపాదే

వైకాపా ఎమ్మెల్యే అంబటి
తాడేపల్లి సెప్టెంబర్ 26, (way2newstv.com)
అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం పని చేస్తున్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి పై బురద చల్లాలనిప్రయత్నం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విషం కక్కే కార్యక్రమాలకు  ఎల్లో మీడియా వంతపాడుతోంది. ఎల్లో మీడియాతో ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం తండ్రి కొడుకులు చేస్తున్నారు. చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లో మీడియా మొదటివార్తలు రాస్తున్నాయని విమర్శించారు. 
రుణమాఫి హామీ తెదేపాదే

దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు.చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి ని అరికడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రివర్స్ టెండర్లు అద్భుతమైన విజయంసాధించింది.రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని అన్నారు. పీపీఏ ద్వారా ఏడాదికి 2500 కోట్లు నష్టం ప్రభుత్వం కు వస్తుంది.. పీపీఎల్లో వందల కోట్లుకమీషన్ పేర్లతో నొక్కేసారు. 87 కోట్ల రుణాలు చంద్రబాబు 24 కోట్లకు కుదించారు. 24 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పి 15 కోట్లు చంద్రబాబు రుణమాఫీ చేశారు.4, 5 రుణమాఫీ ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారు. రుణమాఫీ చేస్తామనే హామీ టీడీపీది..తమది కాదన్నారు.  చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి జగన్మోహన్ రెడ్డికిఏమి సంబంధమని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తుంటే పేపర్ లీకేజీ అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినవెంటనే జగన్మోహన్ రెడ్డి 4 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేశారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. లింగమనేని గెస్ట్ హౌస్ లోచంద్రబాబు ఎందుకు ఉన్నారు.. సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు. అనుమతి లేని ఇంట్లో ఎందుకు ఉంటున్నారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి డిమండ్ చేసారు. .ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీడీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. చంద్రబాబు వెంటనే అక్రమ ఇంటి నుంచి మారి ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా మారాలి.. సుజనాచౌదరి కమల వనంలో ఉన్న పచ్చ పుష్పమని ఆరోపించారు. ఇంకా టీడీపీ నేతగానే సుజనా చౌదరి మాట్లాడుతున్నారని అన్నారు.