నీతి అయోగ్ బృందంలో ముఖ్యమంత్రి భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీతి అయోగ్ బృందంలో ముఖ్యమంత్రి భేటీ

అమరావతి సెప్టెంబర్ 14, (way2newstv.com):
సచివాలయంలో నీతి ఆయోగ్ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్.జగన్, అధికారులు భేటీ అయ్యారు. నీతిఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌కు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు.రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం.విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది. దాన్ని పూడ్చాలంటే నీతి ఆయోగ్ సహకారం అవసరం.అ ది నీతిఆయోగ్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.  అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న ఏపీ,విభజన కారణంగా అభివృద్ధికి దూరమైంది. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే అభివృద్ధికి చోదకాలు. విశాఖపట్నం, విజయనగరం, కడప ఆస్పిరేషనల్ జిల్లాలు. వీటితోపాటుశ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
నీతి అయోగ్ బృందంలో ముఖ్యమంత్రి భేటీ

సమగ్రాభివృద్ధితో మోడల్ స్టేట్ గా రాష్ట్రాన్ని తయారుచేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి  సంకల్పమని అన్నారు. 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోంది.రాష్ట్రానికి కూడా తగిన రీతిలో సహాయం చేస్తే ఆ లక్ష్య సాధనలో మేం కూడా భాగస్వాములం అవుతామని అన్నారు. దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని అనుకున్నప్పుడు రాష్ట్రానికిసహాయం ఉండాలి.  తగిన వనరులు, నైపుణ్యం, అంకిత భావం ఉన్న అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం మాకు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలికాలంలో అనేక చర్యలుతీసుకుంది. బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాం. పరిపాలనలో వికేంద్రీకరణకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం. విభజనలో భాగంగా హామీ ఇచ్చిన కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేయాలి: పారదర్శకతతో కూడిన విధానాలను పరిపాలనలోకి తీసుకు వచ్చామని అన్నారు. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం. మొదటిసారిగా జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చాంమన్నారు. టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేలా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్– చెన్నై, చెన్నై – బెంగుళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. పెట్టుబడులకుకేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం, మీ సహకారం కావాలని అన్నారు.నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ సీఎం ఢిల్లీ వచ్చినప్పుడు సుదీర్ఘంగా నాతో చర్చించారు. నవరత్నాలు కార్యక్రమాలను నాకు వివరించారు. సీఎం ఆలోచన, విజన్, ప్రణాళికలుచాలా బాగున్నాయి. సీఎం వైయస్ జగన్ అంకిత భాగం, విజన్ నన్ను ఆకట్టుకున్నాయన్నారు.  వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే పనితీరు చూపారు. మేం చేయదగ్గదంతా చేస్తాం, తగిన రీతిలోసహకారం అందిస్తాం. అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు ఉండేలా తోడ్పాటును అందిస్తాం:. మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామని అన్నారు.రాష్ట్రానికి పారిశ్రామిక వాటా కూడా తక్కువుగా ఉందని అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ  నిరక్షరాస్యతను అధిగమించిడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా స్కూళ్లను దశలవారీగాఅభివృద్ది చేస్తున్నాం. మొదటి దశలో 15వేల స్కూళ్లలో 9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వరకూ ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామనిఅన్నారు. ఆపై వచ్చే సంవత్సరం 9,10 తరగతుల్లో  ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు కారణంగా చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకుపంపించలేకపోతున్నారు. చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాంమన్నారు.  పిల్లలను బడికి పంపేలా తల్లులనుప్రోత్సహించడానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం, జనవరి 26న అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. మొదట పేదల కడుపులు నింపితే ఆతర్వాత వాళ్లు స్కూళ్లవైపు దృష్టిపెడతారు. నిరక్షరాస్యతనుసున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.