చిత్తూరులో బోగస్ పట్టాల కలకలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిత్తూరులో బోగస్ పట్టాల కలకలం

తిరుపతి, సెప్టెంబర్ 14, (way2newstv.com)
పలమనేరు పట్టణంలో బోగస్‌ ఇంటి పట్టాలు కలకలం రేపుతున్నాయి. 400 వరకు బోగస్‌ ఇంటి పట్టాలు చెలామణిలో ఉన్నాయని సమాచారం. ఈ పట్టాలతో పలువురు ఇందిరమ్మ కాలనీలు,పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో పక్కా ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. ఇప్పటికీ బోగస్‌ పట్టాలు అంగట్లో సరుకుల్లా దొరుకుతున్నాయని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంగతంలో రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఫైలును ఎవరు తొక్కిపెడుతున్నారు.. ఎందుకు తొక్కిపెడుతున్నారన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలామారింది. 
చిత్తూరులో బోగస్ పట్టాల కలకలం

ఇప్పటివరకు బోగస్‌ పట్టాలతో ప్రభుత్వానికి చెందిన రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలు పొంది ఇల్లుకట్టని స్థలాలు, పునాదులో ఆగిన వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల స్కెచ్‌లను రెవెన్యూ సర్వేయర్ల నుంచి బోగస్‌ పట్టాల ముఠా పొందింది. ఆ మేరకు లే అవుట్లో ఖాళీ ఉన్నబ్లాక్‌లను గుర్తించి, అక్కడ ఏ, బీ అనే సబ్‌ డివిజన్‌ నంబర్ల ద్వారా ఒరిజినల్‌ హద్దులనే పెట్టి పట్టాలు తయారు చేశారు. నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మడంతో ప్లాట్లు స్థలాన్ని స్వాధీనంచేయించడం, ఇంటి నిర్మాణం దాకా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఈ ముఠానే దగ్గరుండి చూసుకుంటుందనే ఆరోపణలున్నాయి.గతంలో పలమనేరు తహసీల్దార్లుగా పనిచేసిన నాగమణి,మునాఫ్, రవిచంద్రన్‌ హయాంలో అప్పటి సర్వేయర్లు, ఆర్‌ఐలు, వీఆర్వోల ద్వారా తహసీల్దార్‌ కార్యాలయం, తహసీల్దార్ల సీళ్లను కొందరు సంపాదించినట్లు తెలిసింది. కార్యాలయంలోని ఖాళీ ఇంటిఅనుభవ నివేశపత్రాలు, పట్టాలను భారీగా జిరాక్స్‌ చేయిం చుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐదేళ్లుగా రెవెన్యూ కార్యాలయంలోని కాలనీ స్కెచ్‌ల ఆధారంగానే బోగస్‌ పట్టాల తయారీ జోరుగాసాగినట్టు తెలుస్తోంది. ఈ ముఠాలోని కొందరు సభ్యులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.  ఇంటి పట్టాగాని, అనుభవ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తే కార్యాలయంలోని వీహెచ్‌ఎస్‌లోనమోదు కావాలి. కానీ ఇక్కడ అవేమీలేనట్లు సమాచారం.ఈ కుంభకోణంలో ఓ రిటైర్డ్‌ కరణం, ఓ వీఆర్వో, సర్వేయర్‌ వద్ద పనిచేసిన వెలుగు సర్వేయర్, ఓ ఆర్‌ఐ, నలుగురు బదిలీ అయిన వీఆర్వోలు,నలుగురు మాజీ కౌన్సిలర్లు, పదిమంది రెవెన్యూ బ్రోకర్లు కీలకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.  ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం రెండు సెంట్లు కనిపిస్తే వీళ్లు రంగంలోకి దిగి.. దానికి నకిలీపట్టా తయారు చేయడం జరిగిపోతోంది. సర్వే సైతం వాళ్లే చేసి, హద్దులు చూపి, కొన్న వారికి ఇంటి స్థలాన్ని మూడు రోజుల్లో చేతికిచ్చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో స్థలాలపై అనుభవం కలిగిపట్టాలు లేని వారికి సైతం దొంగపట్టాలను తయారు చేసినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఎఫ్‌ఎంబీ బుక్కులే ఈ ముఠా చేతుల్లో ఉన్నాయంటే వీరు ప్రత్యామ్నాయంగా ఓతహసీల్దార్‌ కార్యాలయాన్నే నడుపుతున్నట్లు ఉంది వ్యవహారం. నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణ జరిపించారు.ఇందులోనూ ఈ విషయం బయటపడింది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందేతొక్కిపెట్టినట్లు సమాచారం.