ఏపీలో కొత్త ఇసుక విధానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో కొత్త ఇసుక విధానం

అమరావతి, సెప్టెంబర్ 04  (way2newstv.com)
అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం బుధవారం  ఉదయం సమావేశమయింది. ఇసుక విధానం, రివర్స్ టెండరింగ్, ఆర్టీసీ విలీనం తదితర దాదాపు 30 కీలక అంశాలపై సమావేశంలో మంత్రివర్గం చర్చించింది. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమల్లోకిరానుంది. టన్ను ఇసుక ధర రూ. 375గా చేసిన ప్రభుత్వం ఖరారు చేసింది. తొలిదశలో అందుబాటులోకి 58 ఇసుక స్టాక్ పాయింట్లు వచ్చాయి. ఏపీఎండీసీ ద్వారా ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. దశలవారీగా ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్లు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 
ఏపీలో కొత్త ఇసుక విధానం

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుకు అంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3216.11 కోట్ల టెండర్ ను  గత ప్రభుత్వం నవయుగ సంస్థకు కేటాయించగా, దాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్కు వెళ్లాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాంట్రాక్టర్ కు ఇచ్చిన అడ్వాన్స్ ను  కూడా వసూలు చేయాలని నిర్ణయించింది.ఇక నవయుగకు కాంట్రాక్టు రద్దుతో పాటు ఇప్పటి వరకు పనులు ప్రారంభించక పోవడంతో మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మావోయిస్టులపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.