ఆనాటి పోరాట వీరుల త్యాగాలు స్మరించుకుందాం..కేటీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆనాటి పోరాట వీరుల త్యాగాలు స్మరించుకుందాం..కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 17, (way2newstv.com)
భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీన దినోస్సవం పురస్కరించుకొని   తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 
ఆనాటి పోరాట  వీరుల త్యాగాలు స్మరించుకుందాం..కేటీఆర్

భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.