అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం పాడవుతుంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం పాడవుతుంది

మంత్రి  ఈటల రాజేందర్.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (way2newstv.com)
చికిత్స కంటే నివారణ ముఖ్యం అనేది తెలంగాణ ప్రభుత్వ భావన అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేకపోవడం వల్లనే సమాజం పాడవుతుందని అన్నారు. శుక్రవారం నాడు కేబీఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన అల్జీమర్స్ అవగాహన వాక్ ను అయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సమాజం పోకడమారింది ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న మైక్రో కుటుంబాలు గా మారిపోయాయి. 
అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం పాడవుతుంది

ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకపోవడంతోనే సమాజంలో ఇలాంటి రుగ్మతలు చూస్తున్నాం. పిల్లల్లో అరాచకభావాలు రాకుండా ఇంట్లో ఉన్న పెద్దవారు చెప్పేవారు.  సమాజంలో ఎలా మసలుకోవాలి, పెద్ద వారిని ఎలా గౌరవించాలి, ఆత్మీయులను ఎలా ప్రేమించాలి అని చెప్పేవారని అయన అన్నారు. కానీ ఇప్పుడు మంచి విషయాలు చెప్పే పెద్ద వారు కుటుంబంలో  లేకపోవడం తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో పిల్లల్లో అనేక చెడు అలవాట్లను చూస్తున్నాం. చిన్నపిల్లల నేరాలకు ఘోరాలకుపాల్పడటం కనిపిస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం కుటుంబం నుంచే రావాలి అప్పుడే సమాజం బాగుంటుందని అయన అన్నారు. ఈ రోజు ఇక్కడ మతిమరుపు జబ్బుకి చికిత్స లేదు సహకారం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు.. కానీ మతిమరుపు వచ్చిన పెద్దలను అంటిపెట్టుకుని ఉండి వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితేమతిమరుపు నుంచి దూరమవుతారు లేదంటే ఒంటరితనం ఆ జబ్బు ను మరింత ఎక్కువ చేస్తుందని అయన అన్నారు.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలకుమెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.  ఈ వ్యాధికి కూడా చికిత్స వస్తే వాటిని ప్రభుత్వపరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీచైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.