ఉద్యోగులకు భారీగా పెరిగిన డీఎ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉద్యోగులకు భారీగా పెరిగిన డీఎ

న్యూఢిల్లీ, అక్టోబరు 11 (way2newstv.com):
మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి బొనాంజా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను ఒకేసారి 5 శాతం మేర పెంచింది. దీంతో ఉద్యోగుల డీఏ 17 శాతానికి పెరిగింది. దీంతో కేవలం ఉద్యోగులకు మత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ప్రయోజనం లభించనుంది.కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుతో 62 లక్షల మంది పెన్షన్లకు ముందుగానే దీపావళి పండుగ వచ్చేలా చేసింది. డీఏ 5 శాతం పెంపు నిర్ణయంతో పెన్షనర్లు ప్రతి నెలా తీసుకునే పెన్షన్ మొత్తం కూడా రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెరగనుంది. 
ఉద్యోగులకు భారీగా పెరిగిన డీఎ

ఆల్ ఇండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ హరీశ్ శంకర్ తివారీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో కల్లా డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు ఇదే ఎక్కువని తెలిపారు.సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి రిటైర్మెంట్ తర్వాత నెలకు కనీసం రూ.9,000 పెన్షన్ లభిస్తుంది. అలాగే గరిష్టంగా రూ.1.25 లక్షల పెన్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రూ.9 వేల పెన్షన్ తీసుకుంటున్న వారికి డీఆర్ పెంపు వల్ల పెన్షన్ మరో రూ.450 పెరుగుతుంది. ఇక రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ ఏకంగా రూ.6,250 మేర పెరుగుతుంది.ఇకపోతే డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.16,000 కోట్ల భారం పడనుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచే పెరిగిన డీఏ లభిస్తుంది. కేంద్ర డీఏను ఏడాదికి రెండు సార్లు సవరిస్తూ ఉంటుంది.గత కొన్నేళ్లలో చూస్తే ఇదే అతిపెద్ద డీఏ పెంపు కావడం గమనార్హం. ఏఐసీపీఐ గణాంకాలు 2019 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో పెరిగాయి. జూన్ నెలకు డీఏ 17.09 శాతంగా ఉంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ ఆఫీస్ మాజీ చైర్మన్ హరి శంకర తెలిపారు.