చంద్రబాబువి ఉసరవెల్లి రాజకీయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబువి ఉసరవెల్లి రాజకీయాలు

విజయవాడ అక్టోబరు 21, (\way2newstv.com)
టెండర్ల లో ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టి చంద్రబాబు తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టారు. వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో 61 కోట్లు రూపాయాలు మిగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పెట్టిన తరువాత సుమారు 1000 కోట్లు మిగిలింది. రాబోయే రోజుల్లో చేపట్టే రివర్స్ టెండరింగ్ లో మరొక 500 కోట్లు మిగులుతాయి. మేము రివర్స్ టెండరింగ్ నిర్వహించిక పోతే 1500 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళేవి. చంద్రబాబు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే వేల కోట్లు మిగిలేవని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎక్సస్ టెండర్లు నిర్వహించడం ద్వారా చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల ప్రజా ధనం మిగిలితే అభినందించాల్సిన ప్రతిపక్ష పార్టీ  విమర్శలు చేయడం సిగ్గుసేటని అన్నారు.
చంద్రబాబువి ఉసరవెల్లి రాజకీయాలు

రివర్స్ టెండింగ్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ ల్లో నాలుగు నుంచి  ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం  ఉపయోగిస్తాం. రేట్లు పెంచి పనులు కాంట్రాక్టర్లు కుఇవ్వడం మంచిదా లేదంటే రేట్లు తగ్గించి పనులు కాంట్రాక్టర్లు కు ఇవ్వడం మంచిదా అని అయన ప్రశ్నించారు. దేవుడు కరుణించి జగన్మోహన్ రెడ్డి పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రంలో జలకళ సంతరించుకుంది.చంద్రబాబు ప్రజాధనాన్ని పదిమంది కాంట్రాక్టర్లుకు కట్టబెట్టాలని చూస్తే అదే ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే తప్పా అని అడిగారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. బీజేపీ నాయకులే చెపుతున్నారు చంద్రబాబుతో ఎందుకు జాతకడతామని. చంద్రబాబు కు గత ఎన్నికల్లో రెండవ స్తానం వచ్చింది వచ్చే ఎన్నికల్లో మూడవ లేదా నాలుగవ స్తానం వస్తుంది. కృషా గోదావరి నదులకు వరదలు రావడం వలన ఇసుక లభ్యతకు కొంత ఇబ్బంది ఏర్పడింది. త్వరలో సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కరం లభిస్తుందని మంత్రి అన్నారు.