విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోండి

ఆ దిశలో మీరు అడుగులు వేయండి
ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుంది
పోలీసులకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సూచన
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం
విజయవాడ, అక్టోబరు 21, (way2newstv.com)
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.  పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు.  రాష్ట్రంలో హోం గార్డులు మొదలు, డీజీపీ వరకు పోలీసుల కష్టాలు స్వయంగా చూశాననిఅయన అన్నారు.  అందుకే శాఖలో పలు మార్పులు తీసుకువచ్చామని, హోం గార్డుల వేతనాలు పెంచడంతో పాటు, దేశంలోనే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేశామని చెప్పారు. 
విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోండి

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా పోలీసులపై రచించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వారికి సెల్యూట్పోలీసు త్యాగాలకు ప్రతిరూపంగా అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారన్న సీఎం ప్రస్తావించారు.రాష్ట్రంలోనూ ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మకు ఒకటి గుర్తు చేస్తున్నానని, పోలీసు టోపీ మీద సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనాలు అని సీఎం పేర్కొన్నారు.  వాటిని అందరి రక్షణకు వినియోగించే వారే పోలీసులు అని, అందుకే పోలీస్ స్టేషన్ను రక్షకభట నిలయం అని పిలుస్తామని అన్నారు.  ఎవరికీ మినహాయింపు లేదు‘నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సదస్సులో నా మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆరోజు నేను చెప్పాను. శాంతి భద్రతల విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని చెప్పాను. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, పిల్లల విషయంలోనూ.. మొత్తంగా పౌరుల రక్షణ విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడవద్దని చెప్పాను.  అలాగే బడుగు బలహీన వర్గాలు, పేదల మీద హింస జరిగితే కారకులను ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టమని చెప్పానని అన్నారు.‘పోలీసు వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే పేదలు వివక్షకు గురి కాకుండా అందరికీ ఒకే నియమంతో, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగితేనే పోలీసు వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది.  న్యాయం, ధర్మం.. ఇవన్నీ కూడా అందరికీ ఒకటే. ఒక్కొక్కరికి ఒక రూల్ ఉండకూడదు.  ఎవరికైనా ఒకే చట్టం అయినప్పుడే వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి. చట్టం అన్నది అందరికి ఒకటే కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి. ఆ బాధ్యత మనందరి మీద ఉందన్న విషయం మర్చిపోవద్దని ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మకు చెబుతున్నాను’ అని సీఎం స్పష్టం చేశారు.పోలీసులు ప్రజల మన్నన పొందినప్పుడే మనం ఏదైనా చేశామని చెప్పుకోవచ్చని, ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.చివరగా, ప్రతి పోలీసుకు ఒకటే చెబుతున్నానని, విధి నిర్వహణలో వారు మంచి పేరు తెచ్చుకునేలా అడుగులు వేయాలని, అందుకు ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని సీఎం చెప్పారు. హోం మంత్రి ఎం.సుచరిత, డీజీపీ గౌతమ్ సావంగ్తో పాటు, పలువురు పోలీసు ఉన్నతాధికారుల, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.