ఆర్బీఐ కీలక నిర్ణయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్బీఐ కీలక నిర్ణయం

ముంబై, అక్టోబరు 23 (way2newstv.com)
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు పరోక్షంగా ప్రయోజనం కలుగనుంది.డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ (డీఎస్ఏ)ను నియమించుకోవద్దని ఆదేశించింది. డీఎస్ఏ ఏజెంట్లు సాధారణంగా రిటైల్ లోన్స్ విక్రయం, రుణ గ్రహీతల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ వంటి పనులు చూసుకుంటూ ఉంటారు.ప్రస్తుతం పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు, కన్సూమర్ క్రెడిట్ వంటి రిటైల్ రుణాలు చాలా వరకు డీఎస్ఏ మార్గంలోనే వస్తున్నాయి. బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణుల సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలిసింది.డేటా థెఫ్ట్ (సమాచార తస్కరణ) కేసులను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ చర్య ద్వారా నిర్వహణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆర్‌బీఐ భావిస్తోంది. 
ఆర్బీఐ కీలక నిర్ణయం

అయితే బ్యాంకులు మాత్రం ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్నాయి. కన్సూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ జారీ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆర్‌బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని భావిస్తున్నాయి.‘ఏజెంట్లు పాత్ర కొద్ది వరకు మాత్రమే ఉంటుందని ఆర్‌బీఐ విశ్వాసిస్తోంది. కేవైసీ ప్రక్రియలోని రుణ గ్రహీతల ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ను బ్యాంక్ అధికారులే నిర్వహించాలని భావిస్తోంది. ఔట్‌సోర్సింగ్ వారు ఈ పని చేయకూడదని చెబుతోంది. రుణ గ్రహీతల వివరాలు దుర్వినియోగం అయ్యాయనే సంఘటనలు ఆర్బీఐ దృష్టికి వచ్చి ఉండొచ్చు’ అని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.39 మంది సభ్యులుగా ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టస్క్ ఫోర్క్స్ (ఎఫ్ఏటీఎఫ్) అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే ఆర్‌బీఐ తాజా నిర్ణయం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎఫ్ఏటీఎఫ్ అనేది ఇంటర్ గవర్నమెంట్ బాడీ. మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొనేందుకు 1989లో ఇది ఏర్పాటైంది.