మెగా కృష్ణారెడ్డిపై శివాజీ ఫైర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెగా కృష్ణారెడ్డిపై శివాజీ ఫైర్

హైద్రాబాద్, అక్టోబరు 3, (way2newstv.com)
కాంట్రాక్టర్లు, పాలకులు పెట్టే టార్చర్‌తో నాలుగు మాసాలుగా మానసిక వేదన అనుభవిస్తున్న హీరో శివాజీ బాంబు పేల్చారు. దేశద్రోహి మెఘా కృష్ణారెడ్డి చీకటి కోణాల్ని ఒక్కోటి బయట పెడతానని సంచలన ప్రకటన చేశారు. శివాజీ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. దేశద్రోహి మెఘా కృష్ణారెడ్డి బండారాన్ని బయట పెట్టబోతున్నానని అందులో ప్రకటించారు. దేశం విస్తుబోయే ఓఎన్‌జీసీకి సంబంధించిన 27 రిగ్గుల కాంట్రాక్టు కుంభకోణాన్ని మొదట బయట పెట్టబోతున్నట్టు చెప్పారు.సాక్షాధారాలతో సహా ఈ పాపాన్ని బయట పెడుతున్నానని, ప్రపంచంలోనే ఇంత పెద్ద నీచమైన స్కామ్ ఎక్కడా జరగలేదని శివాజీ అన్నారు. దీని తరువాత పోలవరం రివర్స్ టెండరింగ్ వెనుక బాగోతాన్ని, తరువాత ఎలక్ర్టికల్ బస్సుల వెనుక మతలబుని, తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక చీకటి కోణాల్ని బయట పెట్టబోతున్నానని చెప్పారు.
మెగా కృష్ణారెడ్డిపై శివాజీ  ఫైర్

‘చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో ప్రోమో రిలీజ్ చేస్తున్నాను. ఇదంతా చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టచ్చు. కానీ వేసే దమ్మూ, ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు.  నేను ఇప్పుడు చెప్పబోయేది దేశద్రోహం గురించి.  ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్నిముఖ్యమంత్రులతో పంచుకోవడం నిజంగా దేశద్రోహం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోటి ప్రజాధనాన్ని ముఖ్యమంత్రులు, కాంట్రాక్టర్లు సొంత బొక్కసాలలోకి మళ్లించుకోవడం అసలైన ప్రజాద్రోహం.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి సబ్సిడీలతోటి బస్సులు కొని, ఆ బస్సుల తోటి వచ్చే ఆదాయాన్నివాళ్ల సొంత జేబుల్లో నింపుకోవడం నిజంగా దేశద్రోహం. లంచం..లంచం.. లంచం అనే పేరుతోటి దేశం కంపు కొట్టుకుపోయినా, ఇంత పెద్ద మీడియా పెరిగినా కూడా ఇంకా ఆ కంపు మనకొస్తోందంటే.. ఓఎన్జీసీకి చెందినటువంటి కొంతమంది గడ్డి తినే సన్నాసుల వల్ల 27 రిగ్గుల కాంట్రాక్టుని చేజిక్కించుకుని ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మరో కొత్తవతారంలో వస్తున్న దేశద్రోహం మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ దేశద్రోహం చేస్తున్నట్టు వంటి, ఈదేశానికి ముప్పుగా పరిణమించిన వ్యక్తి మరెవరో కాదు. ఆ దేశద్రోహి మెఘా కృష్ణారెడ్డి. అతను నడిపే కంపెనీ పేరు మెఘా ఇంజనీరింగ్ సంస్థ. నా దృష్టిలో అది ఒక చైనా పీస్.. ఎందుకంటే ఈరోజున గత 7 ఏళ్లలో ఒక వ్యక్తి తన కంపెనీ ఆదాయాన్ని 26 వేల కోట్లకు వెళ్లిందంటే ఒకసారి ఆలోచించాలి. ఒక నిజమైన మిత్రద్రోహి.. మెఘా కృష్ణారెడ్డి.. గాంధీ జయంతి రోజు ఈ మిత్రద్రోహి ఎలావుంటాడో చెప్పాల్సి రావడం బాధాకరం. జుగుప్సాకరం.మిత్ర ద్రోహి… ఎలా వుంటాడో చెప్పాలంటే..మెఘా కృష్ణారెడ్డి గురించి చెప్పాలి. నువ్ మనిషివా.. మెఘా కృష్ణారెడ్డివా.. అనేట్టుగా వుంటాడు. ఆ మనిషి వల్ల, ఇలాంటి ద్రోహుల వల్ దేశానికి జరుగుతున్న నష్టం అందరికీ తెలియాలి. ఇక నుంచి ప్రతి వారం అతను చేస్తున్న ఘోరాలు, ఈ దేశానికి అతను చేస్తున్న నష్టం, ముఖ్యంగా భారతీయ జనతాపార్టీకి అతను చేస్తున్న నష్టం తెలియచెప్పడానికి వారం వారం మీ ముందుకు వస్తున్నా. విత్ సాక్షాధారాలతో.. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిన నష్టం చెబుతా. ముఖ్యంగా ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్టు గురించి చెబుతా. ఇది చాలా దారుణం. ఇంతకంటే నీచమైన కాంట్రాక్టు ఎక్కడా లేదు. ప్రపంచంలోనే ఇంత నీచం ఎక్కడా లేదు. ఇటలీ నుంచి మొదలైన ఈ వ్యవహారాన్ని విత్ సాక్ష్యాలతో బయటపెడతా. తరువాత బస్సుల బాగోతం బయటపెడతా.. నీళ్లు నిధులు నియామకాలు అంటూ బంగారు తెలంగాణా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన పాలకులు తెలంగాణ కాళేశ్వరం  పేరుతో చేస్తున్న బాగోతాలు సాక్ష్యాలతో సహా బయటపెడతా…ఈ ప్రాజెక్టులో చేతివాటం 35 వేల కోట్ల రూపాయిలు..మా ప్రాణాలకి హానీ వుందని తెలుసు. అయినా దేనికీ వెరవము. ప్రధానమంత్రికే ఈ విషయాన్ని చెప్పాను. నాలుగు నెలలుగా వాళ్లు పెట్టే టార్చర్ భరించాను. అతను, అతని ముఠాలు భయపెట్టాలని చూశాయి. ఎక్కడా వణక్కుండా తొణక్కుండా మా జీవితాలు అతలాకుతలం చేసిన ఆ దుర్మార్గుడి గురించి చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పకపోతే.. భావితరాలు మమ్మల్ని క్షమించవు. మీ భవిష్యత్ కోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాం