బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్

చెన్నై అక్టోబరు 12, (way2newstv.com)
తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. శనివారం ఉదయం స్థానిక మహబలిపురం బీచ్ కు వెళ్లారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా.. అక్కడి పరిసరాల్లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్పులను ఏరడం ప్రారంభించారు  దాదాపు అరగంట పాటు చెత్తను తొలగించారు. 
బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్

ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం.. మనమంతా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేలా చూసుకుందాం అని ట్వీట్ చేశారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడారు.