మళ్లీ తగ్గిన బంగారం ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ముంబై, అక్టోబరు 12, (way2newstv.com)
పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గింది. దీంతో ధర రూ.39,710కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.270 పతనమైంది. దీంతో ధర రూ.36,380కు దిగొచ్చింది. పసిడి ధర ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ100 పెరిగింది. రూ.48,600కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గింది. 
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

దీంతో ధర రూ.38,200కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణించింది. దీంతో ధర రూ.37,150కు తగ్గింది.బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.48,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయిఅంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 1,500 డాలర్ల మార్క్ దిగువకు క్షీణించింది. ఔన్స్ బంగారం ధర 0.50 శాతం క్షీణతతో1,493.05 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 17.57 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి