పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు

ముంబై, నవంబర్ 28 (way2newstv.com)
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. దీంతో ధర రూ.39,430కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.36,140కు చేరింది. ఇకపోతే బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి ధర రూ.150 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.46,150కు దిగొచ్చింది.ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 
 పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగింది. దీంతో ధర రూ.38,100 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. రూ.36,900 వద్దనే కొనసాగుతోంది.బంగారం ధర నిలకడగా కొనసాగితే వెండి మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.150 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,150కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,462.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 17.06 డాలర్లకు ఎగసింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర గత నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని తెలిపారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం డీల్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు.అమెరికా ఫెడరల్ మరోవైపు వడ్డీ రేట్ల కోతకు సుముఖంగా లేకపోవడం కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతోంది. ఫెడ్ ఇప్పటికే వడ్డీ రేట్లును ఈ ఏడాది మూడుసార్లు తగ్గించేసింది. తదుపరి రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.50 వేల మార్క్‌కు ఎగసింది. అయితే మళ్లీ బంగారం ధర ఆ స్థాయికి వెళ్లలేదు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.