మరింత తగ్గిన బంగారం ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరింత తగ్గిన బంగారం ధరలు

ముంబై, నవంబర్ 8 (way2newstv.com)
పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగింది. దీంతో ధర రూ.39,900 వద్దనే ఉంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధర అక్కడే ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో ధర రూ.36,580 వద్దనే కొనసాగింది. అయితే పసిడి ధర గత మూడు రోజుల్లో రూ.510 మేర దిగొచ్చింది. ఇకపతే బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.250 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 
మరింత తగ్గిన బంగారం ధరలు

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.38,550 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.37,350 వద్దనే కొనసాగింది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.48,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.21 శాతం పెరుగుదలతో 1,469.65 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 17.07 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందేబంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి